తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
    గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నట వారసుడు, డెమి గాడ్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీని విశ్వంభర ఫేమ్ వశిష్ఠతో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా పాన్ ఇండియా హిట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం, పునర్జన్మల కాన్సెప్ట్ అని ఈ రోజు ఉదయం అనౌన్స్ మెంట్ రావడంతో    అంచనాలు అంతకు మించి ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ దాగి ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞ హీరోగా నటించడమే కాకుండా, ఆయన తండ్రి బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ మరియు అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య పాత్ర కేవలం కామియో లేదా గెస్ట్ రోల్‌కి మాత్రమే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విశ్వరూప స్థాయి క్యారెక్టర్‌గా ఉండబోతోంది. మోక్షజ్ఞ డెబ్యూ కోసం దర్శకుడు వశిష్ట రాసుకున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో దాదాపు 40 శాతానికి పైగా భాగం అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) మరియు గ్రాఫిక్స్ పనులతో నిండి ఉండనుంది. స్క్రీన్‌పై నందమూరి తండ్రీకొడుకులిద్దరూ ఒకేసారి కనిపించే ఆ సన్నివేశం థియేటర్లలో నందమూరి అభిమానులకి  పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.     Also Read: కమిట్మెంట్ అడిగారంటున్న ప్రముఖ హీరోయిన్: ఆ దర్శకులు, నిర్మాతలు ఏం చేస్తారంటే!   మోక్షజ్ఞ ఈ సినిమా కోసం తన రూపురేఖలను పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ, గత 6 నెలలుగా కఠినమైన వర్కౌట్స్, స్పెషల్ డైట్ మరియు డాన్స్ విభాగార్థంలో శిక్షణ తీసుకుని దాదాపు 15 కిలోల బరువు తగ్గి అత్యంత సన్నగా, స్టైలిష్‌గా మరియు ఫిట్‌గా తయారయ్యారు. అంతేకాకుండా, నటన మరియు ఫైట్స్ శిక్షణ కోసం ముంబై, బ్యాంకాక్‌లలో ప్రత్యేక వర్క్‌షాప్‌లలో కూడా మోక్షజ్ఞ పాల్గొన్నాడు.         [Nanadamuri Mokshagna, Balakrishna, Vasishta, Vishwambhara, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]    
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో 'ఫౌజీ' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'ఫౌజీ' వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని, కాదు మార్చిలో అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండూ కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి లోనేమో ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' ఉంది. అందుకే ఫిబ్రవరి మంచి ఆప్షన్ అని భావిస్తున్నారట. 'ఫౌజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్, కొత్త రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. డేట్ ఫైనల్ అయితే, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.       [Prabhas Fauzi Movie, Fauzi New Release Date, Fauzi February Release, Fauzi Movie 2027, Fauzi vs Spirit, Prabhas, Hanu Raghavapudi, Telugu Film News, Telugu News]  
  కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంది. కానీ సాహితీ దాసరి మాత్రం మరోసారి కాస్టింగ్ కౌచ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. 'మా ఊరి పొలిమేర'లో  అద్భుతమైన పెర్ఫార్మ్ తో  ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సాహితీ  ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ హోదాలో బిజీగా ఉన్నాయి.  సాహితి మాట్లాడుతు  'ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు నేరుగా కాకుండా రకరకాల మార్గాల్లో కమిట్‌మెంట్స్ అడుగుతారు. సాధారణంగా పెద్ద మేకర్స్ నేరుగా నటీమణుల వద్దకి రారు. కోఆర్డినేటర్లు, కాస్టింగ్ మేనేజర్లు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల వంటి మధ్యవర్తుల ద్వారానే ఆ ప్రతిపాదనలు పంపుతారు. "దర్శకుడికి కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఆయనతో నిరంతరం టచ్‌లో ఉండి మెసేజ్‌లు చేస్తూ ఉండాలి, నంబర్ ఇస్తాను మాట్లాడండి, అలా చేస్తే పెద్ద ప్రాజెక్టుల్లో క్రేజీ అవకాశాలు దక్కుతాయి" అంటూ ఈ మధ్యవర్తులు రకరకాల హింట్స్ ఇస్తుంటారని పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు  ఏమాత్రం వెనకడుగు వేయకుండా, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వెంటనే తిరస్కరించాను. ఇటువంటి అడ్డదారులను నిరాకరించడం వల్ల తాను పరిశ్రమలో కొన్ని పెద్ద బానర్ల ప్రాజెక్టులను, 100% మంచి అవకాశాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అవకాశాలు పోయినా సరే, నా నియమాలకు కట్టుబడి ఉండటమే నా లక్ష్యం.        Also Read: ఇరుముడి ఓటిటి డేట్ వచ్చేసింది: అదనపు బోనస్ ఏంటంటే! జీవితంలో ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడూ నిలబడదు. అడ్డదారుల్లో వచ్చే విజయం తాత్కాలికమే. ఎంత చిన్నగా, కష్టపడి అడుగులు వేస్తూ ఎదిగితే పరిశ్రమలో అంత లాంగ్ లాస్టింగ్ ఇమేజ్ ఉంటుంది" అనే సిద్ధాంతాన్ని  గట్టిగా నమ్ముతానని వ్యాఖ్యానించింది. త్వరితగతిన వచ్చే సక్సెస్ కంటే సొంత ప్రతిభపై ఆధారపడటమే నిజమైన విజయం అని ఆమె స్పష్టం చేసింది. పొలిమేర లో   గెటప్ శ్రీను భార్యగా, డీ-గ్లామర్ లుక్‌లో రాముల పాత్రలో నటించి ప్రతి ఒక్కరినీ మెప్పించిన సాహితి పొలిమేర 2 లో కూడా తగ్గేదేలే అంటూ తన సత్తా చాటిన విషయం తెలిసిందే.       [Sahithi Dasari , Casting Couch, Maa Oori Polimera, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
Soori’s Mandaadi is turning out to be a strong performer at the box office, with the makers officially declaring that the film grossed Rs.65 crore worldwide. The latest poster gives the film’s theatrical run a clear commercial boost, especially after the movie managed to hold its ground against competing releases. Directed by Mathimaran Pugazhendhi, Mandaadi stars Soori, Suhas, Sathyaraj and Mahima Nambiar in prominent roles. The sports-action drama has been gaining momentum through strong word of mouth, with its raw setting and intense emotional conflict becoming major talking points. The ₹65 crore milestone is particularly notable for Soori, whose transformation into a leading man continues to gather momentum. What started as a film carrying curiosity around its unusual backdrop has now turned into a genuine theatrical success story. It marks to be a successful debut for Suhas in Tamil and a big hit in his career. Produced by Elred Kumar under RS Infotainment, Mandaadi is also backed by Vetrimaaran as creative producer. With the film continuing its successful theatrical run, the focus now shifts to how fast it can hit the coveted Rs.100 crore mark before The Paradise storm at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సంతోష్ శోభన్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ ఏడాది 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా మరో విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సత్తిబాబు పరలోకయాత్ర' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సినీ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు హాలీవుడ్, ఇత‌ర‌ భాషల్లో సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ జోనర్‌లో మల్టీవర్స్ కాన్సెప్ట్‌లను చూశాం. అయితే, టాలీవుడ్‌లో తొలిసారిగా మల్టీవర్స్ కామెడీ జోనర్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'స్వాతిముత్యం' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పరలోకం లేదా వేరే లోకాల కాన్సెప్ట్‌ను అత్యంత నవ్వులు పూయించేలా వినోదాత్మకంగా మలచబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంతోష్ శోభన్ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, ఒక కంటితో విచిత్రంగా చూస్తూ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన ప్రీతి అస్రాని, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్, డిజైన్ చూస్తుంటే ఇదొక కంప్లీట్ ఫన్ రైడ్ సినిమా అని అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక కొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ 'మల్టీవర్స్ కామెడీ' ప్రేక్షకులకు ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.     [Santosh Soban Sattibabu Paraloka Yatra, Telugu First Multiverse Comedy Movie, Santosh Soban New Movie UV Creations, Sattibabu Paraloka Yatra First Look, Lakshman K Krishna Director Movies]
ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ-10' విన్నర్ రాజు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాల పేరుతో దగ్గరై, మోసం చేశాడంటూ ఒక యువతి ఫిర్యాదుతో రాజుపై కేసు నమోదైంది. అయితే శిరీష అనే యువతితో రాజు మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇక మీదట మనం ఫ్రెండ్స్ లా ఉందాం" అని ఆ ఆడియోలో రాజు చెప్పినట్టుగా ఉంది. అయితే శిరీష మాత్రం.. "రాజు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ, నువ్వు వేరే అమ్మాయికి దగ్గరవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను." అని ఎంతో ఎమోషనల్ గా చెప్పింది. అంతేకాదు, "నా డబ్బులు నేను తిరిగి తీసుకున్నాక.. నీపై నాకు హక్కు ఉండదు. ఇంత జరిగిన తర్వాత ఫ్రెండ్ లా ఉండలేను. ఒకవేళ నువ్వు తప్పు తెలుసుకొని, మనసు మార్చుకొని వస్తానంటే.. ఆ డబ్బులు రిటర్న్ అడగను. ఇంకా 50 లక్షలు లోన్ తీసుకొని నీ చేతిలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను." అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఆడియో క్లిప్ ను బట్టి అర్థమవుతుంది ఏంటంటే.. రాజుని శిరీష మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతనికి లక్షల్లో డబ్బులు కూడా ఇచ్చింది. కానీ, రాజు వేరే అమ్మాయితో చనువుగా ఉండటం శిరీషకు నచ్చలేదు. అందుకే డబ్బులు రిటర్న్ అడిగింది. ఒకవైపు డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూనే.. మరోవైపు రాజు మనసు మార్చుకొని తనతో ఉంటానంటే ఇంకా డబ్బులు ఇస్తానని కూడా చెబుతుంది. మరి ఈ ఆడియోలో నిజానిజాలు ఎంత? ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగి రాజు జైలు పాలయ్యాడు? అనేది తెలియాల్సి ఉంది.       [Dhee Raju Audio Leak, Dhee Raju Case, Raju Sirisha Audio, Dhee Raju Audio, Dhee Raju, Telugu Film News, Telugu Audio, Telugu News]  
తమిళ్ బిగ్ బాస్ సీజన్ 10 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి ఆయన చేసిన 'లీడర్‌షిప్' వ్యాఖ్యలు, దళపతి విజయ్‌పై విసిరిన పరోక్ష సెటైర్లేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సరికొత్త ఫార్మాట్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ తమిళ 10వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి, హౌస్ కెప్టెన్‌గా విఫలమైన కంటెస్టెంట్‌ను నిలదీశారు. నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. "ఆలోచించకుండా హామీలు గుప్పించడం, అసలు సమస్యలు, బాధ్యతలు ఎదురైనప్పుడు ఎదుటి జట్టుపై నెట్టేసి పారిపోవడం లీడర్‌షిప్ అనిపించుకోదు. కేవలం ఉపన్యాసాలు దంచడమే నాయకత్వం కాదు, అది ప్రజలను ఏమార్చడమే అవుతుంది" అంటూ గట్టిగానే క్లాస్ పీకారు. విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన దళపతి విజయ్‌ను ఉద్దేశించే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ అభిమానులు, పొలిటికల్ సపోర్టర్లు ఆయనపై మండిపడుతున్నారు. ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, విజయ్ సేతుపతి కావాలనే పరోక్షంగా పొలిటికల్ టాపిక్ తీసుకొచ్చారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి విజయ్ సేతుపతి, దళపతి విజయ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనూ వేదికలపై విజయ్ సేతుపతి.. విజయ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో సేతుపతి మద్దతుదారులు స్పందిస్తూ.. ఇది కేవలం బిగ్ బాస్ హౌస్ గేమ్‌కు సంబంధించిన సంభాషణ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విజయ్ టీవీ యాజమాన్యం కూడా స్పందిస్తూ, బిగ్ బాస్ షోలో జరిగే చర్చలు కేవలం హౌస్ పరిస్థితులకు పరిమితమైనవని, ఏ వ్యక్తిని గానీ, భావజాలాన్ని గానీ ఉద్దేశించినవి కాదని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.     [Vijay Sethupathi Bigg Boss Tamil 10, Thalapathy Vijay Sethupathi Controversy, Vijay Sethupathi Leadership Speech Bigg Boss, Master Movie Vijay Sethupathi Vijay, Tamil Bigg Boss Season 10 Latest News]
  ఇరుముడి సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. మరిన్ని ఫ్యామిలీ డివోషనల్ చిత్రాల రాకకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచిందని చెప్పవచ్చు. 250 కోట్ల కలెక్షన్స్ లోకి చేరువలో ఉన్న ఇరుముడి ఈ  సంవత్సరంలో 200 కోట్ల మార్కును దాటిన నాల్గవ చిత్రంగా రికార్డుకెక్కింది ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్ క్రాష్ అయ్యే పరిస్థితి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో ఆయా బాషల సినీ ప్రేమికులకి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. మరి థియేటర్స్ లో ఎన్నో రికార్డులని నమోదు చేసిన ఇరుముడి ఓటిటి హిస్టరీలో కూడా రికార్డులు నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాల వారు పేర్కొంటున్నారు.  Also Read: కంటెంట్ ఉందా?: గట్టెక్కిస్తారా!       [Irumudi, Ott Release Date, Netflix, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood'
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి యూత్‌ని ఆలోచింపజేసిన ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ మూవీ 'హుషార్ పిట్టలు'. ఏమాత్రం సౌండ్ లేకుండా, ఉన్నట్లుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బిక్షు ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకి థియేట్రికల్ రన్‌లో మంచి రెస్పాన్సే వచ్చింది. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో అప్పట్లో మంచి టాకే తెచ్చుకుంది.  టీనేజ్‌లో వచ్చే ఆకర్షణ, అవగాహన లేకపోవడం వల్ల జరిగే పొరపాట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ కథలో రవి (అన్ష్) అనే కుర్రాడు చదువులో నంబర్ వన్. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బ్రైట్ స్టూడెంట్. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి రవిని ఎంతో ఇష్టపడుతుంది. కానీ, రవికి ప్రేమ, అట్రాక్షన్ లాంటివేమీ తెలీవు. అతని ప్రపంచం అంతా ఒక్క చదువు మాత్రమే. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. రవి చుట్టూ ఉండే బ్యాచ్‌లో బాలన్న అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. బాలన్న మాటలు, అతని ప్రవర్తన రవిని పూర్తిగా ప్రభావితం చేసి తప్పు దారిలోకి తీసుకెళ్తాయి. ఆ ప్రభావాన్ని తట్టుకోలేక, యుక్తవయసులో వచ్చే మార్పుల వల్ల రవి దారి తప్పుతాడు. చివరకు రవి, చిట్టి ఇద్దరూ హద్దులు దాటి ప్రవర్తించే వరకు వెళ్తారు. శారీరికంగా కలుస్తారు. ఆ విషయం ఇరు కుటుంబాలకూ తెలిసిపోతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు ఇళ్లు ఒక్కసారిగా నరకంలోకి నెట్టబడతాయి. తెలిసీ తెలియక చేసిన తప్పు వల్ల ఆ రెండు కుటుంబాలు ఎలా విలవిలలాడాయి? సమాజం నుంచి ఎలాంటి నిందలు ఎదుర్కొన్నారు? అసలు రవి, చిట్టిల జీవితాలు ఏ మలుపు తిరిగాయి? అనేది ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు. బోల్డ్ గా ఉంటూనే, ఎమోషనల్ గా ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీనేజర్స్ ఎలా దారి తప్పుతున్నారు? తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలను ఇందులో చూపించారు. సైలెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ, ఓటీటీలో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది.        [Hushar Pittalu Movie, OTT Release, Husharu Pittalu, Telugu Movies 2026, Telugu OTT Movies, Amazon Prime Video, Telugu Film News, Telugu News]  
తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి మేకర్స్ ని ప్రేక్షకులు కోరుకునేది ఒకటే.. మంచి కంటెంట్ ఇచ్చి హిట్ రేంజ్ తో పాటు  కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అని. కానీ కొంత మంది ఆ సూత్రాన్ని ఎందుకు పట్టించుకోరో  అర్ధం కాదు. ఈ విషయంలో మొదటి ముద్దాయి నిర్మాణ సంస్థనే. దీంతో  ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. వరుసగా బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు, భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఈ నిర్మాణ సంస్థపై పెద్ద ఎత్తున ప్రశ్నార్థకాలను నిలబెట్టాయి జననాయగన్, టాక్సిక్, తో పాటు రీసెంట్ గా మొన్న బాలీవుడ్ లో విడుదలైన 'హివాన్' (Hiwaan) వంటి వరస సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సంస్థ మెగా స్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న 'కాకా' పై అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల చూపు పడింది. మూవీ లవర్స్ అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ హిట్ మోడ్ లో  ఉన్నా  'కాక" లో సరైన కంటెంట్ ఉండాలి? కేవలం ఇమేజ్ ఆధారంగా సీన్స్ ని తెరకెక్కించవద్దు. కథకి సంబంధించిన అన్ని విషయాల్లో పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.     Also Read: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పిఏ డెత్ కేసు: మౌనం వీడిన  సూరజ్..నిజంగా హీరోనేనా! ఏది ఏమైనా  మునుపటి పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని, బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటేనే  KVN  తన ప్రస్థానాన్ని చాటాలగలదు. ప్రేక్షకులు కేవలం స్టార్‌డమ్‌ను మాత్రమే కాకుండా గ్రిప్పింగ్ స్టోరీ లైన్, బలమైన ఎమోషన్స్ కోరుకుంటున్నారు. కాకాతో   KVN  సంస్థ భారీ హిట్ అందుకోవాలని కోరుకుందాం.       [Kaaka, Content, Chiranjeevi, Hiwaan review, KVN Productions, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన చుట్టూ ఉండే వాతావరణంలో పెరుగుతున్న గాలి కాలుష్యం నేడు మానవాళి ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా మారింది. మనం పీల్చే ప్రతి ఊపిరిలోనూ కంటికి కనిపించని విషపూరితమైన కాలుష్య కణాలు శరీరంలోకి చేరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే వాయు కాలుష్యం ఏ సమయంలో, ఎంత మేర మన శరీరంపై ప్రభావం చూపుతుందో కచ్చితంగా అంచనా వేయడం ఇప్పటివరకు చాలా కష్టంగా ఉండేది. ఈ సవాలుకు పరిష్కారంగా అంతర్జాతీయ పరిశోధకులు ఒక వినూత్నమైన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రియల్ టైమ్‌లో వాయు నాణ్యతను ట్రాక్ చేస్తూ, అది వ్యక్తుల ఆరోగ్యంపై చూపుతున్న ప్రత్యక్ష ప్రభావాన్ని కచ్చితమైన వివరాలతో లెక్కగట్టడం ఇప్పుడు సాధ్యమైంది. ఈ నూతన యాప్ ద్వారా నిర్వహించిన పరిశోధనలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వాతావరణంలోని పిఎమ్ 2.5 (PM2.5) మరియు పిఎమ్ 10 (PM10) కణాల స్థాయిలను, వినియోగదారులు నమోదు చేసే రోజువారీ ఆరోగ్య లక్షణాలతో ఈ యాప్ అనుసంధానిస్తుంది. వేలాది మంది వినియోగదారుల నుంచి సేకరించిన డేటా ప్రకారం, వాతావరణంలో పిఎమ్ 2.5 ప్రమాదకరమైన 50 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ దాటిన రోజుల్లో ప్రజల్లో శ్వాసకోశ ఇబ్బందులు, గొంతు మంట మరియు ఆస్తమా లక్షణాలు ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు పెరుగుతున్నాయని తేలింది. అంతేకాకుండా, నిరంతరం కాలుష్య వాతావరణంలో గడిపే వారిలో 25 శాతం మంది తీవ్రమైన నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు యాప్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.   గాలి కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోందని ఈ యాప్ డేటా నిరూపించింది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య పొగమంచు, కాలుష్యం ఎక్కువగా ఉండే సమయంలో వయోవృద్ధులలో రక్తపోటు హెచ్చుతగ్గులు మరియు గుండె సంబంధిత అసౌకర్యాలు 18 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ యాప్‌లో లభించే రియల్ టైమ్ పొల్యూషన్ అలర్ట్స్ కారణంగా 62 శాతం మంది వినియోగదారులు తమ బయటి పనుల వేళలను మార్చుకుని, తాము పీల్చే విషవాయువుల శాతాన్ని దాదాపు 30 శాతం వరకు తగ్గించుకోగలిగారు. ఇది డిజిటల్ హెల్త్ మానిటరింగ్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాధారణ పొల్యూషన్ మానిటరింగ్ స్టేషన్లు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సగటు సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. కానీ ఈ స్మార్ట్ యాప్ కేవలం 500 మీటర్ల పరిధిలోని స్థానిక వాయు నాణ్యతను ట్రాక్ చేస్తూ వ్యక్తిగత ఆరోగ్య హెచ్చరికలను పంపుతుంది. దీనివల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, ఆస్తమా మరియు గుండె వ్యాధిగ్రస్తులు వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళల్లో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు. N95 మాస్క్‌లు ధరించడం లేదా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం ద్వారా ముందస్తుగా ప్రమాదాన్ని అరికట్టడానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతోంది. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేటి కాలంలో ఇటువంటి డిజిటల్ సాంకేతికత మానవాళికి ఒక రక్షణ కవచంలా మారుతోంది. వాయు కాలుష్యం వల్ల వచ్చే ముప్పును కేవలం అంచనా వేయడమే కాకుండా, ప్రత్యక్ష ఆధారాలతో నివారణ మార్గాలను చూపడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధునిక విజ్ఞానాన్ని, హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని మరియు మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.       [Air Pollution, Air Quality, PM2.5, PM10, Pollution Monitoring, Health Monitoring, Respiratory Health, Asthma, Digital Health, Air Quality App]
  మానవాళి ఆరోగ్యానికి మరియు ఆయుష్షుకు అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధుల్లో గుండె సంబంధిత జబ్బులు (Cardiovascular Diseases) మరియు క్యాన్సర్ ప్రధానమైనవి. అయితే ఇటీవల ప్రచురితమైన అంతర్జాతీయ వైద్య పరిశోధన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్ల జరుగుతున్న మరణాలే అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించి ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులలో లేదా అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు, ఇప్పుడు చిన్న వయసులోనే ప్రాణాలను తీస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. వైద్య గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.8 కోట్ల (180 లక్షల) కంటే ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం మరణాలలో దాదాపు 32 శాతానికి సమానం. దీనికి విరుద్ధంగా క్యాన్సర్ వ్యాధి వల్ల ఏటా సుమారు 1.0 కోటి మరణాలు (మొత్తం మరణాలలో దాదాపు 18 శాతం) సంభవిస్తున్నాయి. అంటే క్యాన్సర్ మహమ్మారి కంటే కూడా గుండె జబ్బులే ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మొదటి ప్రధాన వ్యాధిగా నిలిచాయి. అందులోనూ ముఖ్యంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువత మరియు నడివయస్కులలోనే దాదాపు 35 శాతం గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర హెచ్చరిక సంకేతంగా మారింది. వైద్య నిపుణులు మరియు కార్డియాలజిస్టుల ప్రకారం, ఈ గుండె జబ్బుల విజృంభణకు మన ఆధునిక జీవనశైలే 70 శాతానికి పైగా కారణమవుతోంది. అనియంత్రిత అధిక రక్తపోటు (Hypertension), శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం, మధుమేహం (Diabetes), పొగతాగడం (Smoking) మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress) గుండె నాళాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రోజువారీ ఆహారంలో 50 శాతానికి పైగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, అధిక ఉప్పు మరియు ప్రాసెస్డ్ చక్కెర వాడకం రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి దారితీస్తున్నాయి. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయి క్షణాల్లో హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ సంభవిస్తోంది.   అయితే ఈ ప్రాణాంతక పరిస్థితి నుండి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమేనని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం పాటించే సరైన జీవనశైలి మార్పుల ద్వారా దాదాపు 80 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే అరికట్టవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా సాధారణ వ్యాయామం చేయడం వల్ల గుండె పనితీరు 40 శాతం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉప్పు వాడకాన్ని రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా పరిమితం చేయడం చాలా అవసరం. 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి గుండె సంబంధిత రొటీన్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ శ్రేయస్సుకు మూలస్తంభం. గుండె అందించే సూక్ష్మ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం మరియు ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే గుండె జబ్బుల బారిన పడకుండా దీర్ఘాయుష్షును పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.     [Heart Disease, Cardiovascular Diseases, Cancer, Heart Attack, Cardiac Arrest, Heart Health, High Blood Pressure, Cholesterol, Diabetes, Healthy Lifestyle]  
మహిళల జీవిత ప్రయాణంలో రుతుక్రమం ప్రారంభం కావడం (మెనార్కే) మరియు అది సంపూర్ణంగా నిలిచిపోవడం (మెనోపాజ్) అనేవి రెండు అత్యంత పవిత్రమైన, సహజమైన శారీరక ఘట్టాలు. అయితే, నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న తరచుగా ఉత్పన్నమవుతోంది. చిన్నతనంలోనే, అంటే చాలా తక్కువ వయసులోనే మొదటిసారి నెలసరి వస్తే, భవిష్యత్తులో మెనోపాజ్ కూడా త్వరగానే వచ్చేస్తుందా... ఈ రెండింటి మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా.. ఈ ప్రశ్నకు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు (గైనకాలజిస్ట్), బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ లావణ్య కిరణ్ మరియు అంతర్జాతీయ పరిశోధనలు ఆసక్తికరమైన, శాస్త్రీయమైన సమాధానాలను అందించాయి. సాధారణంగా బాలికలలో 10 నుండి 15 సంవత్సరాల వయసు మధ్యలో మొదటిసారి నెలసరి ప్రారంభమవుతుంది. అలాగే స్త్రీలలో సాధారణ మెనోపాజ్ అనేది 45 నుండి 55 సంవత్సరాల వయసు మధ్య సంభవిస్తుంది. అయితే ఒక మహిళకు మెనోపాజ్ వచ్చే వయసు అనేది జన్యుపరమైన అంశాలు, వారి జీవనశైలి, శారీరక ఆరోగ్యం, ధూమపానం మరియు కొన్ని రకాల వైద్య చికిత్సలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, 11 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే రుతుక్రమం పొందిన బాలికలలో త్వరగా లేదా ముందస్తుగా మెనోపాజ్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందని వైద్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం ప్రసిద్ధ  జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబోలిజం లో ప్రచురితమైన  నర్సెస్ హెల్త్ స్టడీ 2  పరిశోధన వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ బృహత్తర అధ్యయనంలో 25 నుండి 42 సంవత్సరాల వయసు గల దాదాపు 1,08,000 మందికి పైగా మహిళలను ఏకంగా 20 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో సర్జరీ లేదా కేన్సర్ చికిత్సలు వంటి ఎలాంటి వైద్యపరమైన కారణాలు లేకుండగానే సుమారు 2,800 మంది మహిళలు 45 సంవత్సరాల వయసు కంటే ముందే సహజమైన ముందస్తు మెనోపాజ్ (Early Natural Menopause) దశకు చేరుకున్నారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం, 9 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులోనే మొదటిసారి నెలసరి వచ్చిన బాలికలలో, 12 సంవత్సరాల వయసులో నెలసరి ప్రారంభమైన మహిళలతో పోలిస్తే 45 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనితో పాటు, మహిళల రుతుచక్ర వ్యవధి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. 25 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే స్వల్ప రుతుచక్రాలు ఉన్న మహిళల్లో అండాలు త్వరగా విడుదల కావడం వల్ల వారిలోని సహజమైన అండాశయ నిల్వలు త్వరగా ఖాళీ అయిపోతాయి. ఫలితంగా వారికి మెనోపాజ్ త్వరగా వస్తుంది. అదే సుదీర్ఘమైన లేదా క్రమం లేని రుతుచక్రాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. 45 ఏళ్ల కంటే ముందే వచ్చే ముందస్తు మెనోపాజ్ వల్ల గుండె జబ్బులు, ఎముకల సాంద్రత తగ్గిపోవడం (ఆస్టియోపోరోసిస్) వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ లావణ్య కిరణ్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు కంటే ముందే క్రమం లేని నెలసరి, శరీరంలో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లాషెస్), రాత్రి వేళల్లో తీవ్రంగా చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, యోని పొడిబారడం, తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. చిన్న వయసులోనే నెలసరి వచ్చినా ఆందోళన చెందకుండా, పోషకాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం మరియు క్రమం తప్పకుండా గైనకాలజీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. [Menarche, Menopause, Early Menopause, Womens Health, Menstrual Cycle, Reproductive Health, Gynecology, Dr Lavanya Kiran, KIMS Hospitals, Early Menopause Risk]
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.  
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.