కిడ్నీ క్యాన్సర్ కు ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమం!

కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.  
Publish Date: May 7, 2024 10:30AM

సమ్మర్ లో టమోటా జ్యూస్ తాగితే కలిగే లాభాలివీ..!

టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే..  అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే.. సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. టమోటా  లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా  సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి.   ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు  తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ  ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది. టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.  టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల  జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు,  జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది.                                                                *రూపశ్రీ.
Publish Date: May 6, 2024 11:17AM

ఎండాకాలంలో రోజూ ఎండుద్రాక్ష నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.                                             *రూపశ్రీ.
Publish Date: May 4, 2024 11:13AM

వేసవిలో బాదం పప్పు తినడం మంచిదేనా? అసలు నిజాలు ఇవీ!

  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 
Publish Date: May 3, 2024 12:03PM

వేసవికాలంలో సోపు తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.
Publish Date: May 2, 2024 11:11AM

రాత్రి తొందరగా భోజనం చేయమని పెద్దవాళ్లు చెప్పేది ఇందుకే!

మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.
Publish Date: May 1, 2024 11:13AM

వేసవికాలంలో జీర్ణ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు!

  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.
Publish Date: Apr 30, 2024 11:23AM

మధుమేహం ఉన్నవారు మామిడిపండు తినేటప్పుడు ఈ తప్పు చేస్తే అంతే!

మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.  
Publish Date: Apr 29, 2024 10:53AM

సింపుల్‌గా బరువు తగ్గాలంటే...

అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.
Publish Date: Apr 27, 2024 10:30AM

వేసవిలో ఖర్భూజా తింటున్నారా? ఈ నిజాలు తప్పక తెలుసుకోవాలి!

వేసవి కాలంలో అందరూ ఎం ఇష్టంగా తినే ఖర్భుజాను స్వీట్ మెలోన్ లేదా రాక్ మెలోన్ అని అంటారు. హిందీ, మరాఠీ, తెలుగులో దీనిని 'ఖర్బూజా' అని పిలుస్తారు, తమిళంలో దీనిని 'ములం పజం' అని పిలుస్తారు. బెంగాలీలు దీనిని 'ఖర్ముజ్' అని పిలుస్తారు, గుజరాతీలు దీనిని షకర్టెట్టి అని పిలుస్తారు. ప్రాంతాలు, పేర్లు ఎన్ని మారినా ఈ ఖర్భూజా మాత్రం మ్యాజిక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దొరికే అన్ని పండ్లలోకి ఇది చాలా అద్బుతమైనది అని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ ఖర్భూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..  ఖర్భూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక కణాలైన తెల్ల రక్త కణాలను (WBC) బిల్డ్ చేస్తుంది. తద్వారా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . ఇవి సాధారణంగా మూసుకుపోయిన రంధ్రాల్లో పెరిగిమొటిమలుగా కనిపించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కూడా సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం, ఖర్భూజా, పుదీనా కాంబినేషన్ గా జ్యూస్ ప్రయత్నించవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది చక్కెర లేకుండా ఈ జ్యుస్ తీసుకుంటే కేలరీలు బెడద ఉండదు.  బరువు తగ్గించే ఆహారం తీసుకునే వారు ఎప్పుడూ రుచినిచ్చే పదార్థాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఖర్భూజా బెస్ట్ ఆప్షన్. ఇది నోటికి, కడుపుకు కూడా తృప్తిని ఇస్తుంది. దీనివల్ల బరువు పెరగరు.  కేవలం ఇదొక్కటే కాకుండా దీనితో పాటు ఇతర పండ్లను భాగం చేసుకుని ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. ఖర్భూజాలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ను నిరోధించడంలో, క్యాన్సర్ తో పోరాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.  తరచుగా నోటి పుండ్లు మరియు నమలడంలో ఇబ్బంది ఉన్నవారు క్యాన్సర్ రోగులు ఖచ్చితంగా ఖర్భుజా తీసుకోవాలి.  ఖర్భూజా పండులో కొవ్వులు ఉండవు.  ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా  ధమనులను ఆరోగ్యంగా ఉంచి గుండెను కాపాడుతుంది. శరీరానికి  సరిపడామెగ్నీషియం ఉందులో లభిస్తుంది.  ఇది హృదయ స్పందనను సక్రమంగా ఉంచుతుంది.  ఇందులో ఉండే  పొటాషియం  రక్తపోటును నిర్వహించడానికి పని చేస్తుంది. ఎక్కువ శాతం నీటితో నిండిన పండ్లలో ఖర్భూజా ఒకటి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.  జీర్ణశయానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, నిర్విషీకరణకు సహాయపడుతుంది.  చాలామందిలో తరచుగా వచ్చే  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) తగ్గించండంలో సహాయపడుతుంది.  అసిడిటీ సమస్య ఉన్నవారికి ఖర్భూజా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భూజా కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఖర్భూజా తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలిని నియంత్రించుకోవచ్చు.  ◆నిశ్శబ్ద.
Publish Date: Apr 26, 2024 10:30AM

యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ఈ విషయాలు తెలుసా?

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మధుమేహ రోగులకు.. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.  మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. బరువు.. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి  ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది.  ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.   ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. గుండె ఆరోగ్యం.. చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా,  రక్తపోటును నియంత్రించడం అయినా..  ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా  సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.   ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యం.. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం  దురద, ఎరుపు,  చర్మ అంటువ్యాధులు మొదలైన  సమస్యలలో  బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి.. యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి.  5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి.  ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి.  దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు,  చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు   వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                         *రూపశ్రీ.  
Publish Date: Apr 25, 2024 11:10AM

మామిడిపండ్లను తినేముందు నీటిలో కొద్దిసేపు ఉంచి తినాలి ఎందుకో తెలుసా?

వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఆ ఎదురు చూపులు అన్నీ మామిడికాయల కోసమే. పండ్లలో రారాజు అని చెప్పుకునే మామిడికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సమ్మర్ లో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే చాలు..  ఎంత ధర అయినా కొనేసి వాటి రుచిని ఆస్వాదించేవారు ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇంట్లో మామిడి కాయలు ఉంటే అమ్మలో, అమ్మమ్మలో ముందే వాటిని నీళ్లున్న టబ్ లో వేసి ఓ గంటాగిన తరువాత తినడానికి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. మామిడి పండ్లను ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక మండుతున్న ఎండల్లో హాయిగా చల్లగా తింటూ ఉంటారు. అయితే ఇది తప్పని ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మార్గమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు మామిడిపండ్లను నీటిలో ఎందుకు ఉంచాలి? దీనివెనుక గల ఆరోగ్య రహస్యం ఏంటి? తెలుసుకుంటే... నీళ్లలో కొద్దిసేపు ఉంచిన మామిడిపండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. నిజానికి మామిడిపండు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియ,  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కానీ ఈ సమస్యను నీటిలో కాసేపు ఉంచడం ద్వారా తగ్గించుకోవచ్చు. మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాని అధిక పరిమాణం కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడే  అవకాశం ఉంటుంది . అయితే మామిడిని కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి పంటకు  హానికరమైన పురుగుమందులు,  ఎరువులు అధిక పరిమాణంలో  ఉపయోగిస్తారు. మామిడి సాగులో కూడా ఇవి తప్పనిసరి. ఇవి మామిడి తొక్కపై ఉంటాయి.  ఇవి తినేటప్పుడు  శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మామిడిని కనీసం అరగంట నుండి గంట సేపైనా నీటిలో ఉంచడం అవసరం. తద్వారా వాటిపై ఉన్న పురుగుమందులు తొలగిపోతాయి. మామిడిలో కొంత మొత్తంలో తెల్లని స్రావం ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు,  అలెర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల  స్రావం తగ్గుతుంది.   తద్వారా చర్మ సమస్యలు ఏవీ ఇబ్బంది పెట్టవు. మామిడికాయను నీళ్లలో ఉంచకుండా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల కొంత సమయం పాటు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.  మామిడిని నీటిలో ఉంచి తింటే అందులో హైడ్రేటింగ్ లక్షణాలు పెరుగుతాయి.                                                     *రూపశ్రీ.
Publish Date: Apr 24, 2024 10:30AM

నిద్రలో ఎప్పుడైనా నరాలు లాగేస్తుంటాయా?  కారణాలు ఇవే కావచ్చు!

ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే ఉంటున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే.. కనీసం పోషకాహార లోపం, విటమిన్ల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారున్నారు. అయితే కొందరు రాత్రి సమయాలలో నిద్రపోయేటప్పుడు కాళ్లు లాగేస్తుంటాయి. ముఖ్యంగా కాలి లోపలి నరాలు మెలితిప్పినట్టు అనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు అవుతుంది?  వీటి వెనుక కారణాలేంటి?  తెలుసుకుంటే.. చాలామంది రాత్రి నిద్రసమయాలలో కాళ్లు లాగేస్తన్నాయని, నిద్ర పట్టడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. నిద్రలోనూ, విశ్రాంతి సమయాల్లో నరాలు లాగినట్టు లేదా నరాలు  ఉబ్బుతున్నట్టు కనిపించినా అవన్నీ  శరీరంలో పోషకాహార లోపం  వల్ల కలిగే ఇబ్బందులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాకుండా లేస్తున్నప్పుడు, కూర్చునేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో సిరలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దీనికి కేవలం పోషకాహార లోపం మాత్రమే కారణం కాదు. శరీరంలో నీరు, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. శరీరంలో వేలకొద్ది నరాలు ఉంటాయి. వీటిని సిరలు అని కూడా సంభోదిస్తారు. ఈ సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ సరిగా లేకపోవడం. హిమోగ్లోబిన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. చాలామందికి తెలియని మరొక ముఖ్య కారణం విటమిన్-సి లోపం. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉండాలంటే ఐరన్ అవసరం. కానీ విటమిన్-సి లోపిస్తే శరీరం ఐరన్ ను గ్రహించలేగు. కాబట్టి విటమిన్-సి లోపం వల్ల ఐరన్ లోపం,హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం, రక్తహీనత, నరాల సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. విటమిన్-సి లోపం వల్ల కూడా   రాత్రి నిద్రపోతున్న సమయంలో నరాలు ఇబ్బంది పెడతాయి. మద్యపానం తీసుకునే వారిలో నరాల సంబంధ సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మద్యపానం కూడా విటమిన్లు, ఐరన్ మొదలైనవి శరీరం గ్రహించకుండా చేస్తాయి.                                                     *రూపశ్రీ.  
Publish Date: Apr 23, 2024 11:24AM

రోగాలు రాకుండా చూసుకోవడం ఎలా ?

అసలు రోగం రానే కూడాడు వచ్చిందా శరీర తత్వాన్ని బట్టి ఆ వ్యక్తి లో రోగ నిరోధక శక్తి ఉంటె మాత్రమే రోగాల నుండి తట్టుకోగలడు. అయితే అసలు రోగాలు రాకుండా చూసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు అది ఎలా సాధ్యం?  సాధ్యమే అని అంటున్నారు నిపుణులు... మన చుట్టూ ఉండే వాతావరణం లో ఎన్నో రకాల వైరస్ లు బాక్టీరియా,ఫంగస్, పరాసైట్స్ , లాంటివి అదృశ్యంగా దాగి వుంటాయి . మన శరీరం లోకి ప్రవేశించడానికి తహ తహ లాడుతూ ఉంటాయి. సాధారణ జలుబు నుండి ఫ్లూ దాకా ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్లు మూలంగానే సోకుతాయి వీటి బారినుంచి. శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ను పటిష్ట పరుచుకోవడంద్వారా శరీరాన్ని మనం రోగాల బారినుండి రక్షించుకున్న వాళ్ళ మౌతాము. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళ మౌతాము.ఆరోగ్యం గురించి ఆలోచించ దల్చుకున్నాప్పుడు మొదట రోగ నిరోధక వ్యవస్థ మీద దృష్టి నిలపాల్సి ఉంటుంది. మతి మాటికి ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ మీ శరీరం రోగాల బారిన పడుతుంటే మీ లోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని దానిని బలోపేతం  చేయాల్సిన అవసరం ఉందని అర్ధం చేసుకోవాలి. శారీరక వ్యాయామం... రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే ఎక్సర్ సైజ్ లు చక్కగా ఉపక రిస్తాయి. శారీరక వ్యాయామం చేయడం మూలంగా మీలో రోగనిరోదక సామర్ధ్యం పెరగడమే కాకుండా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. గుండె,ఊపిరి తిత్తుల కండరాలు బల పడతాయి.  1) వ్వయస్సు పెరుగుతున్న కొద్దీ సహజంగానే మనలో రోగాల్ని తట్టుకునే శక్తి పోతుంది.ఎక్సర్ సైజ్ లు తరిగిపోవాదాన్ని అడ్డుకుంటాయి. 2) అమెరికాలో జరిపిన ఒక పరిశీలనలో రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తూ తగిన ఫిట్నెస్ సాధించిన వాళ్ళ లో 7౦ఏళ్ళు పై బడిన అమ్మమ్మ లలో రోగాల్ని నిలువరించే శక్తి వాళ్ళలో సగం వయస్సు ఉన్న స్త్రీల స్థాయిలో ఉన్నట్లుగా తెలిసింది. అలాగే ఏ పనిపాటా చేయని అదే వయస్సులో ఉన్న మిగతా ముసలి వాళ్ళ కంటే 55% ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటి అంటే మంచి ఫిట్ నెస్ లో ఉన్న 7౦ ఏళ్ళు పై బడ్డ వృద్ధులు అంతా 6౦ ఏళ్ళు పై బడ్డాక ఎక్సర్ సైజ్ లు చేయడం మొదలు పెట్టారు. దానిని బట్టి అర్ధమయ్యింది ఏమిటి అంటే ఎక్సర్ సైజ్ ను ప్రారంభించడానికి వాటిద్వారా బెనిఫిట్ పొందడానికి ఒక వయస్సు అంటూ ఏమీ లేదు. ఏ వయస్సు నుంచి అయినా వయో వృద్ధులు సైతం ప్రారంభించ వచ్చు.  ఏది చేసినా అతిగా వద్దు... కొంతం మంది క్రీడా కారులు ముఖ్యంగా పరుగు పందేలాలో పాల్గొనే వాళ్ళు ఎక్కువగా శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ ఉండడం కనిపిస్తుంది. దీనికి కారణం వాళ్ళు అతిగా ట్రైనింగ్ లో పాల్గొనడం తప్ప మరొకటి కాదు. రోగ నిరోధక శక్తి వ్యవస్థను కుంగ దీసేది ఎక్సర్ సైజు లు కాదు. ఎక్సర్ సైజ్ లలో తీవ్రత అని గుర్తించాలి. ఎక్సర్ సైజ్ ల విషయం లో ఎప్పుడైనా మితాన్ని మితాన్ని పాటించడం మంచిది.  అయితే మితం అంటే ఎంత ?  వారం లో అయిదు రోజులు పాటు తడవకు 45 నిమిషాల చొప్పున చురుకుగా ఎక్సర్ సైజులు చేసే చేసే వాళ్ళను సరిపడా ఎక్సర్ సైజులు చేస్తున్న వారికింద తీసుకోవచ్చు. ఇలాంటి వారి యొక్క రక్తాన్ని ల్యాబ్ లో పరీక్షించి నప్పుడు అందులో ఇన్ఫెక్షన్ తో పోరాడే తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి చురుకుగా పనిచేస్తున్నట్లు వేల్లదియ్యింది. అమెరికాలో జరిగిన మరొక పరిశోదనలో అయిడ్స్ తాలూకు హెచ్ ఐ వి తో బాధ పడుతున్న వ్యక్తుల్ని పది వారాల పాటు సాధారణ ఎక్సర్ సైజ్ ప్రోగ్రాములలో పాల్గొనే టట్లుగా చేసినప్పుడు వాళ్ళ లో టి సెల్ కణాల సంఖ్య పెరిగి నట్లుగా వెల్లడి అయ్యింది. ( రోగ నిరోధక వ్యవస్థ లో ఈ టి సెల్ల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలో రోగాలతో పోరాడే గుణాన్ని క్రమబద్దీకరించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ని పారద్రోలడానికి ఉపక రిస్తుంది. ఈ కణాల సాంఖ్య పడిపోవడం ఎయిడ్స్ వ్యాధి ప్రాధాన లక్ష్యం )  జలుబు ఫ్లూ ... జలుబూ-ఫ్లూ లాంటి అంటూ వ్యాధులు గాలి లోని వైరస్ ల ద్వారా సోకుతాయి. మనకు ఇతరుల నుంచి చాలా త్వరగా సోకుతాయి. చాలా త్వరగా సంక్రమించే అంటూ వ్యాధులు ఇవి. ఇవి చలికాలం లో ఎక్కువగా సోకుతూ ఉంటాయి. ఇందుకు కారణం చలికాలం లో మనం తలుపులు అన్నీ వేసుకుని అందరం లోపలే ఉండి పోవడమే. దీనికి కారణం అఫీస్ లోగాని ఇళ్ళలో గాని ఒకరి గాలిని మరొకళ్ళు పీల్చుకుంటూ వైరస్ వ్యాప్తికి తోడ్పడు తూ ఉంటాము. ఇలాంటి రోజుల్లో కిటికీ తలుపులు అన్నీ తెరచి వుంచుకోవాలి గాలి వస్తూ పోతూ ఉంటె జలుబుఅంటుకోదని నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్త కణాలు... రోగ నిరోధక శక్తి యొక్క ప్రాధాన ఆయుదం . రక్తంలో ఉండే లెఉకాక్ సైక్లేస్ అనబడే తెల్ల రక్త కణాలు ఇవి శరీరంలోకి ప్రవేశించిన శత్రువును అంటే వైరస్ ,బాక్టీరియా కావచ్చు ,ఫంగి పరాసైట్ ఏదైనా కావచ్చు నిర్మూలించే ప్రయాత్నం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు శత్రువును చుట్టూ ముట్టి నాశనం చేయడానికి ప్రయత్నిస్తే మరికొన్ని ప్రత్యేకమైన యాంటీ బాడీస్ ని తయారుచేసి వాటి ద్వారా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.ఈ ప్రక్రియ గురించి ప్రారంభ లో చదివే ఉంటారు. లెఉకొసైట్స్ రక్త ప్రవాహం తో పాటు మన శరీర మంతా కలయ తిరుగుతూ సూక్ష్మాతి సూక్ష్మ మైన రక్త నాళాల ద్వారా శరీర కణాల లోకి ప్రవహించి. శత్రు నిర్మూలన కోసం గస్తీ తిరుగుతాయి. అవసరం లేనప్పుడు లింఫ్ గ్రంధులతో కనెక్ట్ అయి వుంటే లింఫ్ నాళా లలోకి చేరుకుంటాయి. మెడ మొల చంక వద్ద ఉండే ఈ లింఫ్ గ్రంధులు ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు ఉబ్బి గావడ బిళ్ళలు గజ్జల్లో బిళ్ళ కింద కనిపిస్తాయి.  రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు... * వారానికి మూడు రోజులు 2౦ నిమిషాల పాటు ఎక్సర్ సైజ్ లు చేయాలి. స్ట్రెచ్ చేయడం. శరీరాన్ని బల పరిచే మిగత ఎక్సర్ సైజ్ లను కూడా మరకూడదు.  *ఎప్పుడూ మంచి మూడ్ లో ఉల్లాసంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. *రిలాక్సేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి. *ఎదో ఒక హాబీ ని అలవరచుకుని తరచుగా అందులో నిమగ్నం కావాలి. *ప్రతి ఆరు వా రాలకి ఒక సారి కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుని హాలిడే కింద ఎక్కడైనా సరదాగా గడపాలని సూచించారు. *వారంలో ఒక రాత్రి అయినా త్వరగా పడుకోవాలి. బాగా అలిసిపోయి నప్పుడు ఇన్ఫెక్షన్ మనల్ని కమ్ము కుంటాయి. ఒత్తిళ్లలో ఉన్నప్పుడు ఎక్కువసేపు మేలుకుని ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ పడక మీద ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం మంచిది. *జ్వరం జలుబు ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు తగ్గి తగ్గ గానే పనుల్లో పాల్గొన కూడదు అలా చేయడం వల్ల డిప్రెషన్ కొన్నాళ్ళ పాటు అలసట మిమ్మల్ని వేదిస్తాయి. దీనికారణంగా మళ్ళీ మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. *పొగ త్రాగ కూడదు. పొగ తాగే వాళ్ళలో న్యుమోనియా,ఫ్లూ లాంటి వ్యాధులూ,దగ్గు, జలుబు, లాంటి వ్యాధులూ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ లూ అంటుకునే అవకాసం ఉంది. పొగ తాగే అల వాటు ఉన్న వాళ్ళు మిగిలిన వారికంటే సి విటమిన్ కొంచం అంటే 4౦ % ఎక్కువే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  అనారోగ్యం పై మూడ్స్ ప్రభావం... సున్నితమైన స్వభావాలు అంటే వోత్తిళ్ళకు తేలికగా లొంగి పోయే వాళ్ళ ను జలుబు జ్వరాలు ఎప్పుడు పడితే అప్పుడు తేలికగా పీడిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉంటాము. *రోగ నిరోధక వ్యవస్థ మీద మన మూడ్స్ ప్రభావం కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే వుంటుంది. ఎప్పుడూ కోపంతో చిరాకుతో వుండే వాళ్ళు తనకు తాను ప్రాముఖ్యతను ఫీలయ్యే వ్యక్తులు మాటి మాటికీ జ్వరం జలుబూ బారిన పడుతున్న వాళ్ళు టేక్షన్ ని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా జ్వరం బారిన పడతారు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే వాళ్ళు పోజిటివ్ గా ఉండే వాళ్ళు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వాళ్ళు చీదతమనేది ఎరగకుండా ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా డిప్రెషన్ తో వుండే వాళ్ళు గుండె జబ్బులకు లోనవుతున్నారు. ఎమోషన్స్ ను అణు చుకుంటూ పైకి ప్రశాంత చిత్తం తో కనపడడానికి చూసే వాళ్ళు క్యాన్సర్ బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉనాయని తేల్చారు.  పోషక ఆహారం... రోగాలు రాకుండా ఉండడానికి అంటే రోగనిరోదక వ్యవస్థ పటిష్ట పడడానికి అన్నిటిలోకి శక్తి వంతమైనది సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.సరైన ఆహారాన్ని తీసుకోక పోవడం వల్ల రకరకాల జబ్బులు మన శరీరాన్ని లోన్గాదీసుకుంటాయి.గుండె జబ్బులు, పక్ష వాతం బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, దంత క్షయం, డయాబెటిస్, మల బద్ధకం ఒస్టియో ప్రోరోసిస్, మొదలైన వన్నీ అయితే పోషక ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిజంగా రోగ నిరోధక వ్యవస్థ బల పడుతుందా.పోషకాహార లోపం వల్ల రోగనిరోదక వ్యవస్థ బలహీన పడుతున్నది అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం. హేతుబడ్డ మైన రీతిలో ప్రోటీన్లు తీసుకోవడం అవసరమే గాని దానికి విటమిన్లు, మినరల్స్, కలిపినంత మాత్రాన రోగనిరోదక శక్తి పెరుగుతుందని అనుకోవడం మాత్రం సందేహాస్పదం. అంటున్నారు ఆక్స్ఫర్డ్ లోని జాన్ రాడ్క్లిఫ్ హాస్పిటల్కు చెందిన కన్సల్టెంట్ ఇమ్యునలజిస్ట్ డాక్టర్ గ్రహం బర్డ్. అయితే గుండె జబ్బులు క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి యాంటి ఆక్సిడెంట్ విటమిన్లు సి ఇ బీటా కేరొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం అని అందరూ ఒపుకుంటారు. బలమైన రోగ నిరోధక వ్యవస్త కు కొన్ని ఖనిజ లవణాలు కూడా అవసరమే.
Publish Date: Apr 22, 2024 10:30AM

వేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?  

వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు అసౌకర్యానికి గురవుతారు. అయితే వీరు మాత్రమే కాదు.. ఎండల ధాటికి డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ఉండే ముప్పేంటి? డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే.. వేసవి కాలం డయాబెటిస్ రోగులపైన ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి  డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుంది.  తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.   శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో  ఇబ్బంది పడతారు. అందుకే ఈ  వేసవిలో  శరీర ఉష్ణోగ్రత,  చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి కింది టిప్స్ పాటించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి.. వేసవి కాలంలో నీరు  బెస్ట్ ఫ్రెండ్. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.   అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా  ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు  తీసుకోవడం పెంచాలి. హైడ్రేటింగ్ ఆహారాలు.. ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ,  టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను చేర్చాలి. ఈ ఆహారాలు  హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కెఫీన్ ఆహారాలు వద్దు..  కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాటన్ దుస్తులు..  కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా  శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత  చక్కెర స్థాయిని పాడు చేస్తుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి..  రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.  వైద్యుల సలహా ప్రకారం  మెడిసిన్  లేదా ఇన్సులిన్ మోతాదును తీసుకోవాలి.                                                     *రూపశ్రీ.  
Publish Date: Apr 20, 2024 11:59AM