జకీర్ నాయక్ కు కేంద్రం ఝలక్...ఏకకాలంలో దాడులు
posted on Nov 19, 2016 9:20AM
ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ చేసే ప్రసంగం ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఝలక్ ఇచ్చింది. ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మహారాష్ట్రలోని ఆయన నిషేధిత సంస్థతో సంబంధం కలిగి ఉన్న పది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, ఆ సంస్థలకు జకీర్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపైనా ఆరా తీస్తుంది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది.