ఆ జిల్లాలో వైసిపి పార్టీ పరువు తీస్తున్న ఆ ఎమ్మెల్యే

 

సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అలాగే ముఖ్య నాయకులకు అవినీతికి దూరంగా ఉండాలని క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితులలోను ఎ స్థాయిలోను అవినీతిని సహించేది లేదని మంత్రివర్గ సమావేశాలలో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఐతే ఆయన సొంత జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇపుడు పార్టీ పరువు తీస్తున్నారని సమాచారం. ఆయన ఒక పెద్ద కుటుంబానికి చెందిన నేత అయినా తన నియోజకవర్గం లోని చికెన్ షాపుల నుండి మొదలు పెట్టి తోపుడు బళ్ల వరకు ఎవరిని వదలకుండా దుడ్లు (సొమ్ములు) వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేతలు ఐతే ఏకంగా ఆయన సొంత టాక్స్ వసూలు చేస్తున్నారని కావాలంటే వీడియో ఆధారాలతో సహా ఇస్తామని అంటున్నారట. ఐతే ట్విస్ట్ ఏమిటంటే గత టీడీపీ హయాంలో కూడా ఆయన ఈ వసూళ్లు చేసారని ఐతే ఇపుడు మరింత జబర్దస్త్ గా వసూలు చేస్తున్నారని అంటున్నారు. చూద్దాం మరి జగన్ ఈ చిల్లర వసూళ్ల పై ఏ చర్యలు తీసుకుంటారో.