తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో జగన్ షాక్ !!
posted on Sep 11, 2019 4:31PM
గత మేలో జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి 151 స్థానాలలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలలో టీడీపీ పైన ఉన్న వ్యతిరేకత, అలాగే జగన్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ రిక్వెస్ట్ తో అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కూడా చూడకుండా గెలిపించడం జరిగింది. వైసిపి తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలలో కొంత మంది రాజకీయాలకు కొత్తవారు కూడా ఉన్నారు. ఐతే తాజాగా సీఎం జగన్ కు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఇంకా ముఖం కూడా చూపించలేదట. మా ఎమ్మెల్యే ను ఇంతవరకు మేము సరిగా చూసింది లేదని ప్రజలు అనుకుంటున్నట్లుగా రిపోర్ట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అలర్ట్ అయిన జగన్ ఆ ఎమ్మెల్యేలను ప్రజల మధ్యకు వెళ్లాలని చెప్పేందుకు త్వరలో రెడీ అవుతున్నట్లు సమాచారం.