మహిళను రేప్ చేసిన తండ్రీకొడుకులు

నిజం. మీరు చదివింది నిజమే. ఓ మహిళను తండ్రి, కొడుకు కలిపి అత్యాచారం చేశారు. కోరిక తీర్చుకున్నాకైనా వదిలి పెట్టలేదు ఆ దుర్మార్గులు. మహిళను రేప్ చేసి అనంతరం ఆమెకు నిప్పు పెట్టారు. 30శాతం కాలిన గాయాలతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అరాచకాలకు కేరాఫ్ అయిన ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 

యూపీ, సీతాపూర్ జిల్లాలో జరిగిందీ అఘాయిత్యం. పుట్టింటికి వెళ్లేందుకు ఓ మహిళ జట్కా బండి ఎక్కింది. ఆ బండిలోనే ప్రయాణిస్తున్నారు ఆ శాడిస్ట్ తండ్రీకొడుకులు. కొంతదూరం వెళ్లాక వారిలో కామం బుసలు కొట్టింది. తండ్రి ఉన్నాడని కొడుకు భయపడలేదు, కొడుకు ఉన్నాడని తండ్రి కంట్రోల్ చేసుకోలేదు. ఇద్దరూ కలిసి.. ఒళ్లు మరిచి, బరితెగించి.. ఆ మహిళపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమెకు నిప్పుపెట్టారు. కాలిన గాయాలతో ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది ఆ మహిళ. కామాంధులైన ఆ తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు పోలీసులు.