వరంగల్ సెంట్రల్ జైలు.. ఇద్దరు ఖైదీలు పరారు..

 

వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. బీహార్‌కు చెందిన ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. దీంతో జైలు సూపరింటెండెంట్ ఉన్నతాధికారుకు సమాచారం ఇవ్వడంతో.. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారైన ఖైదీలు రాజేశ్‌యాదవ్, సైనిక్‌సింగ్‌లని జైలు అధికారులు తెలిపారు.