వరవరరావు అరెస్టు

 

విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాయకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించాలని విరసం నేతలు భావించారు. కాగా ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలా అయిన సభను నిర్వహించాలని భావించిన విరసం నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో శనివారం రాత్రి వరవరరావుతోపాటు దాదాపు 50 మంది విరసం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరిని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు.