గ్రేటర్ షాక్ తో ఉత్తమ్ రాజీనామా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ దారుణ వైఫల్యం చెందింది. కేవలం 2 డివిజన్లను మాత్రమే గెలుచుకుంది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌ లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో ఉత్తమ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం ఎదురవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.