ఇద్దరు పిల్లలూ మృతి.. తండ్రికి గుండెపోటు!

 

మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో రజియా, వహీద్ అనే ఇద్దరు అక్కా తమ్ముళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. వీరిద్దరూ సమీపంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందినవారు. తన ఇద్దరు పిల్లలూ ప్రమాదంలో చనిపోయారని తెలియగానే వారి తండ్రికి గుండెపోటు వచ్చింది. ప్రమాదకరమైన పరిస్థితిలో వున్న ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా,యాక్సిడెంట్‌కి గురైన బస్సును డ్రైవ్ చేసింది రెగ్యులర్‌గా బస్ డ్రైవ్ చేసే డ్రైవర్ కాదు.. ఒక ట్రాక్టర్ డ్రైవర్. బస్సు డ్రైవర్ సెలవు పెట్టడంతో పాఠశాల యాజమాన్యం ఒక ట్రాక్టర్ డ్రైవర్ని పిల్లలను తీసుకురమ్మని బస్సు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ట్రాక్టర్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో ఇంత ఘోరం జరిగింది. స్కూలు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 చిన్నారులు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.