Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తాం : కెసిఆర్
posted on: Mar 12, 2013 8:00AM
.png)
తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని ప్రకటించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోమని ప్రకటిస్తుండగా, వై.ఎస్.ఆర్.సి.పి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలా వద్దా మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అటు తెలుగుదేశం, ఇటు వై.ఎస్.ఆర్.సి.పి.లను ఇరుకున పెట్టేందుకే కెసిఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సరైన సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి తమకు మద్ధతు ప్రకటించాల్సిందిగా కెసిఆర్ బిజెపి, మజ్లీస్, సిపిఎం, సిపీఐ, లోక్ సత్తా పార్టీల మద్ధతు కొరకు కసరత్తు చేస్తున్నారు.


.png)



