జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: హరీష్ రావు

 

మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ని గెలిపించడానికి ఇప్పటికే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. మెదక్ నియోజకవర్గంలో పోటీ అనేది నామమాత్రమేనని హరీష్‌రావు చెప్పారు.