ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో దారుణం

 

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో దారుణం జరిగింది. ఎస్వీ యూనివర్సిటీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివశంకర్ తిరుపతి ప్రకాష్ నగర్‌లోని ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటారు. ఆయన శుక్రవారం ఉదయం విధులకు వెళ్ళారు. ఈ సమయంలో ఈ ఇంటిమీద దోపిడీ దొంగలు దాడి చేసి ఆయన భార్య సుధారాణి (50)ని తీవ్రంగా గాయపరిచి, ఇంట్లో వున్న డబ్బు, నగలు ఎత్తుకుపోయారు. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడిన సుధారాణిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు. ఈ దారుణాన్ని ప్రొఫెషనల్ దోపిడీ దొంగలు చేశారా.. లేక తెలిసినవారే చేసి దోపిడీ దొంగలు చేసినట్టుగా పరిస్థితులు సృష్టించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.