ఎన్జీటీలో తెలంగాణ సచివాలయం కూల్చివేత పై విచారణ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పై పర్యావరణ అనుమతులు లేవని, దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖలను ప్రతివాదులుగా చేస్తూ ఆయన వేసిన పిటిషన్ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్లో విచారణ జరిగింది. సచివాలయ భవనం కూల్చివేత పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నేషనల్ ట్రిబ్యునల్ కు వివరించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయిన తర్వాతే ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగిస్తామంటూ కేసును సోమవారానికి వాయిదా వేశారు.‌