నేడు టీ మంత్రుల సమావేశం

 

శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. చాలా కీలకమైన ఈ సమావేశంలో తెలంగాణ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన విషయం వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సమావేశం జరపనున్నారు. జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యి జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.