స్థలం ఇచ్చేది లేదు.!!

 

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధుకు అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ నజరానా ప్రకటించాయి.. ఏపీ ప్రభుత్వం స్థలం, నగదు బహుమతితో పాటు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది.. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం 1000 గజాల స్థలంతో పాటు రూ.5 కోట్ల నగదును ఆమెకు అందజేసింది.. అయితే, తనకు ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న 398 గజాల స్థలం కూడా కావాలంటూ ఆమె కొన్నాళ్ల క్రితం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు.. కాగా ఆమె విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.. రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందిన నేపథ్యంలో ఆమెకు అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం కార్యాలయం భావించినట్లు సమాచారం.