జానారెడ్డి ఏడుపు చూతము రారండీ!

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత జానారెడ్డి మనసులో మాట బయటకి చెప్పారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఓ ప్రశ్నకు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారమే లేక ఏడుస్తుంటే ఇక ఆధిపత్య పోరు ఎక్కడిదని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి జానారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని వస్తున్న వార్తల మీద స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు. పొన్నాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆధిపత్య పోరు పుకార్లు కేవలం అపోహలే అన్నారు. తామిద్దరం స్నేహపూర్వకంగా వున్నామని జానారెడ్డి వివరణ ఇచ్చారు. మాట్లాడుకుంటున్నామని చెప్పారు.