సీఎం సహాయనిధి చెక్కులు బౌన్స్

 

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కి ఒక లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు జారీ చేసిన దాదాపు 3,600 చెక్కుల పరిస్థితి ఇలాగే వుందని షబ్బీర్ వివరించారు. పాత ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు అయ్యేలా తెలంగాణ సీఎం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.