మనీ మేటర్‌ తేల్చండి.

 

సీమాంద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకి విభజన తర్వాత బ్యాలెన్స్‌ షీట్‌ ఏమిటనే డౌటొచ్చింది. అందుకే వీరంతా కలిసి అధిష్టానానికి లేఖ రాయలని నిర్ణయించుకున్నారు. ఇందులో తెలంగాణ ముసాయిదా బిల్లు విధివిధానాలపై మరింత స్పష్టత కావాలని కోరనున్నారు. అంతేకాకుండా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వివరాలను కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇ:తకీ ఈ లేఖకు అర్ధమేమిటి? విభజనను ఆపలేమని, కనీసం అస్థుల అప్పుల సంగతైనా తేల్చుకుందామని వీరు భావిస్తున్నారా? లేక వీలున్నంత కాలం ఈ గందరగోళాన్ని సాగదీయాలనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీమవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.