సరదాగా సెర్బియా విజిట్ చేయండి.. అంతా అక్కడి పోలీసులే చూసుకుంటారు: విజయ్ సాయి రెడ్డి కి కౌంటర్

 

 

తిరుమలలో అన్యమత ప్రచారం పై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీని పై స్పందించిన వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు పై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం విషయంలో చంద్రబాబు బట్టలు చించుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

దీనికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంతే దీటుగా కౌంటర్ వేశారు.  "తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి విజయసాయిరెడ్డికి మైండ్ కూడా పోయిందని" బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అలాగే "అయన మెంటల్  స్టేజ్ 4వ దశకు చేరిందని దానికి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ ఇండియాలో లేవని.. సరదాగా ఒకసారి సెర్బియా వెళ్లి రారాదు, అంతా అక్కడి పోలీసులే చూసుకుంటారు" అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.