Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైల్లో పేలుళ్ళ కేసు మేమే పరిశోధిస్తాం.. కేంద్రం సాయం వద్దు: జయ
posted on: May 2, 2014 12:05PM

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గౌహతి ఎక్స్ ప్రెస్ రైల్లో జరిగిన బాంబు పేలుళ్లలో మన రాష్ట్రానికి చెందిన స్వాతి మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ళలో దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ కేసు విచారణకు సంబంధించి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదని, తమ రాష్ట్ర పోలీసు అధికారులే ఈ కేసును పరిశోధిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. కేంద్రం అందిస్తానన్న సాయాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ కేసును విచారించే బాధ్యతను తమిళనాడుకు చెందిన స్పెషల్ వింగ్ పోలీసు అధికారులకు జయలలిత అప్పగించారు. ఈ కేసును పరిశోధించే విషయంలో కేంద్రం తనంతట తానే చొరవ చూపించినా జయలలిత తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



.jpg)


