రాహుల్ పౌరసత్వం.. అంత అర్జంటుగా విచారించలేం.. సుప్రీంకోర్టు

posted on: Nov 25, 2015 9:45AM

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ పౌరసత్వంపై విమర్శలు చేయడం.. దానికి రాహుల్ కూడా నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అంటూ సవాల్ విసరడం జరిగాయి. అంతేకాదు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సుప్రీంకోర్టు రాహుల్ పౌరసత్వంపై వేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని.. రాహుల్ గాంధీ పౌరసత్వంపై వెంటనే కేసు నమోదు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని.. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఎన్నికల్లో పోటీ చేశారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మాత్రం తక్షణమే విచారించడానికి నిరాకరించింది. ఇప్పుడు అత్యంత అవసరంగా విచారించలేమని చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...