కుటుంబం ఆత్మహత్య

 

అప్పులు తీరక.. పెరిగిపోతున్న వడ్డీలను కట్టలేక, అప్పులు తీర్చాలని అప్పులు ఇచ్చినవారు తీర్చాలని చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక, రోజు గడవటమే కష్టంగా మారిపోవడంతో హైదరాబాద్‌లో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, భర్త, కుమారుడు విషం తాగి మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో వున్న కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి జరిగింది. శనివారం ఉదయం స్థానికులు ఈ ఘోరాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పులు తీర్చలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వీరు రాసిన లేఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.