ఎంఐఎం అక్బరుద్దీన్ ఫై చర్యలను పరిశీలిస్తున్నాం : స్పీకర్

 

 

 

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసిఫై శాసనసభ నిభందనలకు లోబడి చర్యలు తీసుకొనే విషయాన్ని పరిశీలుస్తున్నామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

 

అక్బరుద్దీన్ విషయాన్ని శాసనసభ నైతిక విలువల కమిటీకి అప్పగించే విషయాన్ని ఆలోచిస్తున్నామని స్పీకర్ అన్నారు. ఎంఎల్ఏ గా ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్ మనోహర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అక్బర్ ఈ వ్యాఖ్యలు ఓ బహిరంగ సభలో చేసినప్పటికీ, శాసనసభ నిభందనల పరిధిలో ఎలాంటి చర్యలు ఆయనఫై తీసుకోవాలో కూడా సమీక్ష జరుపుతున్నామని స్పీకర్ అన్నారు. ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాలని తనకు చాలా ఫిర్యాదులు అందాయని మనోహర్ ప్రకటించారు.

 

సభలో సభ్యుడుగా ఉన్నప్పుడు సభ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుందని స్పీకర్ సభ్యులందరికీ సూచించారు. అలాగే, పరిటాల సునీత ఇంటిలో అర్ధరాత్రి చేసిన తనిఖీల విషయంఫై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అనంతపూర్ జిల్లా ఎస్ పి ని ఆదేశించానని మనోహర్ అన్నారు.