శశిథరూర్ కి లై డిటెక్టర్ పరీక్ష..!

సునంధ పుష్కర్ హత్యలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమె విషంతో చనిపోయింది అని ఎయిమ్స్  వైద్యులు వెల్లడించారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చిక్కులో పడ్డారు. మరోవైపు ఈయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఢిల్లీ పోలీసులు థరూర్ను విచారించడంతో పాటు ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తులను పోలీసులు మరోసారి విచారించారు. శశి థరూర్ డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, సునందను పరీక్షించిన వైద్యుడిని పోలీసులు ప్రశ్నించారు.