మహిళను గ్యాంగ్‌రేప్ చేసిన దోషులకు మరణశిక్ష

 

అఫ్ఘనిస్థాన్‌లో ఒక మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు సభ్యులున్న ముఠాకి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అత్యాచారంతో పాటు దోపిడీకి పాల్పడిన ఈ సంఘటనను అత్యంత అరుదైన కేసుగా పరిగణించి కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దేశంలో ఇటువంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే మరిన్ని సంఘటనలు ఇటువంటివి జరిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అఫ్గనిస్తాన్‌లోని పగ్మన్ జిల్లాలో గత నెల వివాహానికి హాజరై వాహనాల్లో తిరిగివస్తున్న పలు కుటుంబాలకు చెందినవారిపై పోలీసు దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేస్తూ వాహనాల్లో ఉన్నవారిపై దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. అంతేకాకుండా ఒక మహిళను సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై ఘోరంగా సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.