గర్భిణిని వర్షం హతమార్చింది

 

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్‌లోని ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. ఆమెషామీర్‌పేట నివాసి. కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నదులు ప్రవహించాయి. అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు చోట్ల గోడలు కూలిపోయాయి. అనేక నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్నో చోట్ల మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు చేరిపోయాయి. మహిళ మృతికి జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలని డిమాండ్లు వినిపించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హైదరాబాద్ కమిషన్ సోమేష్ కుమార్ హామీ ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం జీహెచ్ఎంసీ మీద కేసు నమోదు చేేశారు.