రేపు సాయంత్రం వరకే సీఎం కుర్చీలో కుమారస్వామి!!

 

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే మళ్లీ అధికారం అని తేల్చేయడంతో.. కర్ణాటకలో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం జోరందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర మంత్రి సదానందగౌడ కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి సీఎం సీట్లో కూర్చుంటారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. సదానంద వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చేలా ఉంది.