అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ...

 

మొహాలీలో శ్రీలంక, టీమిండియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరల్డ్ రికార్డ్ సాధించాడు. 151 బంతుల్లో రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో డబుల్ సెంచరీ (208) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సాధించాడు. కాగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్  4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. రోహిత్ 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశాడు. చివరి బంతికి పాండ్యా ఔట్ అయ్యాడు.