లాలూ ప్రసాద్ యాదవ్‌కి తీవ్ర అస్వస్థత

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం నాడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దాంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆయనని పరీక్షించిన వైద్యులు అంత గాభరా పడాల్సిన విషయమేమీ కాదని తేల్చారు. లాలూనూ సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. బీహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరుగుతోంది. ఈ ఎన్నికలు లాలూకి చాలా ప్రతిష్ఠాత్మకమైనవి. ఈ సందర్భంగా లాలూ టెన్షన్‌కి గురి కావడం వల్ల అనారోగ్యానికి గురై వుంటారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.