ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లోకి రామ్ చరణ్

 

ప్రముఖ నటులు చాలా మంది సినిమాలు చేస్తూనె ఇతర బిజినెస్ లు చాలా చేస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. తాజాగా చెర్రీ ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. "టర్బో మెగా" పేరుతో ఏర్పాటయ్యే ఈ ఎయిర్‌లైన్స్ రామ్‌చరణ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. సివిల్‌ ఎవియేషన్స్‌ మినిస్టరీ నుంచి అనుమతులు కూడా మంజురయ్యాయి. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఎన్‌ఓసీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.15 కోట్ల షేర్ క్యాపిటల్, మరో రూ.12 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తో గతేడాది మార్చి 14నే 'టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఓ ఫర్మ్ కూడా రిజిస్టర్ చేయించారు. ఈ కొత్త వెంచర్‌కి రామ్‌చరణ్‌తోపాటు మరో డైరెక్టర్‌గా వంకాయలపాటి ఉమేష్‌ వ్యవహరిచనున్నట్లు సమాచారం.