హిట్లరే కూలిపోయాడు...మోడీ ఎంత...!

 

గత కొద్దిరోజులుగా విలక్షన నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై విమర్సలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డారు. బీజేపీ మతత్వంను పెంచి పోషిస్తోందని... అలాగే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తప్పుడు హామీలిచ్చి.. మభ్యపెడుతోందన్నారు.  అంతేకాదు ‘సర్వాధికార ధోరణి కొద్ది రోజులకు మాత్రమే పరిమితం... హిట్లర్‌ లాంటివారి అధిపత్యమే కూలిపోయింది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగానదిని స్వచ్ఛంగా మారుస్తానని హామీ ఇచ్చిన బీజేపీ కొంతమేర పనులు చేపట్టి ఈ తర్వాత చేతులు దులిపేసకుందని విమర్శించారు.