ప్రభుత్వం పనితీరు బహు బాగుంది: పవన్ కళ్యాణ్
posted on Oct 17, 2014 10:36AM
పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరును ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే తాను విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటించలేదని ఆయన చెప్పారు. సినీస్టార్స్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తుఫాను బాధితులకు సహాయపడాలని సూచించారు. ఖమ్మం పట్టణంలో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న శ్రీజను పరామర్శించేందుకు తాను నేడు ఖమ్మం వెళ్తున్నట్లు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.