పవన్ కళ్యాణ్‌ని జనం రాళ్ళతో కొడతారు

 

మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం వుందని వార్తలు వస్తున్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జన సేన మద్దతిస్తే జనం పవన్ కళ్యాణ్‌ని రాళ్లతో కొడతారని ఓయూ జేఏసీ నాయకులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారని అంటున్నారు. మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.