నేను ప్రభుత్వాలను విమర్శించలేదు.. పవన్

 

గురువారం నాడు ఏపీ రాజధాని గ్రామాలను పర్యటించి ఏదేదో ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. రాజధానికి అన్ని ఎకరాలు చాలు.. ఇన్ని ఎకరాలు చాలు, రైతుల చేత కన్నీరు పెట్టించడం మంచిది కాదు, దీక్ష చేస్తా... ఇలాంటి డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పునరాలోచనలో పడి వెంటనే మర్నాడే సవరణ ప్రకటనలుచేశాడు. తాను ఏ ప్రభుత్వాన్నీ విమర్శించే విధంగా మాట్లాడలేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరణ ఇచ్చుకున్నాడు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవనిచెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. ఏది ఏమైనా.. నోరు జారనేల.. సరిదిద్దుకోనేల?