విమాన ప్రమాదంలో బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతి

 

ఒకప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తల్లి, సోదరి, సోదరి భర్త ముగ్గురూ కూడా ఇంగ్లాండ్ లో నిన్న రాత్రి జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. వారు ఇటలీలోని మిలన్ నుండి బ్రిటన్ లోని హాంప్ షైర్ కి ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానంలో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఏమ్బ్రియర్ ఫీనం-300 జెట్ విమానం రన్ వే మీద దిగే ముందు బ్లాక్ బుష్ విమానాశ్రయం పక్కనే ఉన్న కార్ల వేలం వేసే కంపెనీ మీద కూలి పేలిపోయింది. ఆ ప్రమాదంలో విమాన పైలెట్ తో సహా ముగ్గురూ మరణించారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వాళ్ళ జరిగిందా లేక ఏదయినా కుట్ర జరిగిందా లేక వేరే ఇతర కారణాలేమయినా ఉన్నాయా అనే విషయం దర్యాప్తులో తేలుతుంది. బ్రిటన్ దర్యాప్తు బృందాలు ఘటాన స్థలికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టాయి.