గుజరాత్ గవర్నర్‌గా ఒ.పి.కోహ్లీ ప్రమాణం

 

గుజరాత్‌ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా బీజేపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఒ.పి.కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒ.పి. కోహ్లీతో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా ఉత్తర్వులను చదివి వినిపించారు. 74 సంవత్సరాల వయసున్న ఒ.పి. కోహ్లీ గుజరాత్ రాష్ట్రానికి 24వ గవర్నర్. ఇప్పటి వరకూ గుజరాత్ గవర్నర్‌గా వున్న 87 ఏళ్ళ కమలా బెనీవాల్‌ను కేంద్రం మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేసి బెనీవాల్ స్థానంలో ఒ.పి. కోహ్లీని గుజరాత్ గవర్నర్‌గా నియమించింది.