దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై సుమోటో కేసు.. ఎన్ హెచ్ ఆర్ సి నిజ నిర్ధారణ కమిటీ

 

హైదరాబాద్ వెటర్నరి డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సైబారాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును స్వీకరించినాట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై త్వరలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఎన్ కౌంటర్ పై ఒక సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిశ అత్యాచారానికి, హత్యకు గురైన  స్థలాన్ని అలాగే ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఒక నివేదిక ఇస్తుందని సమాచారం.