దాసరి కుమారుడు తారక ప్రభుపై అరెస్ట్ వారంట్

 

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు తారక ప్రభుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భరణం చెల్లించడం లేదని తారక ప్రభు భార్య సుశీల కోర్టును ఆశ్రయించడంతో ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు తారక ప్రభు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. భరణం విషయంలో తారక ప్రభు, అతని భార్య సుశీల మధ్య చాలా కాలం కోర్టు కేసు నడుస్తోంది. గతంలో ఫ్యామిలీ కోర్టు సుశీలకు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభు రికారల్ పిటీషన్ దాఖలు చేసి భరణం రద్దయ్యేలా ఉత్తర్వులు పొందారు. అయితే సుశీల అంతటితో ఆగకుండా పైకోర్టులకు వెళ్లింది. ఇలా ఈ భరణం వివాదం గత కొంత కాలంగా సాగుతూనే ఉంది. తారక ప్రభు తండ్రిని ఎదిరించి ఈ వివాహం చేసుకున్నారు. తండ్రి వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో గతంలో కొంతకాలం పాటు తారకప్రభు ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయి ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.