ముద్రగడ మళ్లీ జంప్?

 

టీడీపీ నేత యనమల రామకృష్ణుడితో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అనుచరులు తునిలో సమావేశమయ్యారు. ముద్రగడను టీడీపీలోకి ఆహ్వానించి ప్రత్తిపాడు లేదా జగ్గంపేట టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు వినతి చేశారు. అయితే ఆ స్థానాల్లో ఖాళీ లేదని యనమల చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికి అనేక పార్టీలు మారిన ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఇమడలేక మళ్లీ ఎలాగోలా తన పాత ఇంటికి వచ్చేయాలని ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాను నేరుగా వెళ్లకుండా తన అనుచరులను యనమల వద్దకు పంపినట్లు సమాచారం.