ఇన్నాళ్లు గుర్తుకు రాని వారిపై ఇప్పుడెందుకు ప్రేమ

 

గల్ఫ్ దేశాల్లో జీవనం గడుపుతున్న తెలంగాణకు చెందిన వలస కార్మికులతో సమావేశమై గల్ఫ్ మేనిఫెస్టో వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు దుబాయ్ వెళ్లిన సంగతి విదితమే.అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటనపై నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు.నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత..కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి కార్మికులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని,ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్ కార్మికుల పట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే గల్ఫ్ కార్మికుల కోసం ఖర్చు చేస్తే.. తెరాస నాలుగేళ్ల పాలనలో రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన 1278 కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తీసుకొచ్చామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచి బకాయి సొమ్మును కూడా చెల్లించామని తెలిపారు.