ఇండియా హిందూ దేశమే... భగవత్...

 

ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇండియా హిందూ దేశమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌకిక రాజ్యమైన భారతదేశాన్ని హిందూ దేశంగా మోహన్ భగవత్ అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది. ‘‘భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది’’ మోహన్ భగవత్ పేర్కొన్నారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ఇండియాలో ఉండేవారందరూ హిందూవులేనంటూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే.