కరోనా మహమ్మారి నుండి బయట పడ్డ ముఖ్య మంత్రి
posted on Aug 5, 2020 5:58PM
మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా జరిపిన టెస్ట్ లో ఆయనకు నెగిటివ్ రావడంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గత నెల 25న కరోనా బారినపడ్డారు. దీంతో చికిత్స కోసం ఆయన భోపాల్లోని చిరాయు ఆస్పత్రిలో చేరారు. అయితే మరి కొన్ని రోజుల పాటు ఆయనను తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.
ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన తరువాత డాక్టర్ల బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మాత్రం అంత ప్రమాదకరం కాదని.. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు తీస్తుందని ఈ సందర్బంగా అయన హెచ్చరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా అయన సూచించారు. అవసరమైతే కచ్చితంగా చికిత్స తీసుకోవాలని వివరించారు. అంతకుముందు తనకు చికిత్స చేసిన వైద్య సిబ్బందితో కలిసి అయన ఫొటోలు దిగారు.