ఇంత దారుణమా.. ఆరునెలల పసికందుపై అత్యాచారం...


ఇప్పటికే కథువా, ఉన్నావో అత్యాచార కేసులు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పడు సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఈ దారుణ మైన ఘటన జరిగింది. ఆరు నెలల పసికందుపై కూడా  లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం... ఇండోర్‌లోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో గల ఓ భవనం బేస్‌మెంట్‌లో రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.విచారణ చేపట్టిన పోలీసులు బేస్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. అందులో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి సదరు చిన్నారిని భుజాన ఎత్తుకొని బేస్‌మెంట్‌కు తీసుకొచ్చినట్లు ఉంది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇక విచారణలో తెలిసింది ఏంటంటే... చిన్నారిని ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు.. పాపపై లైంగిక దాడికి పాల్పడి.. చంపేసినట్టు చెప్పారు. దీంతో ఈ విషయం బయటకు రాగానే అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి  నెలల పసికందును కూడా వదలట్లేదని ఆగ్రహ జ్వాలలు విసురుతున్నారు. నిజంగా ఇలాంటి ఘటనలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిందే..