మాకు టిక్కెట్లొద్దు నాయనో..

 

 

 

జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల బరిలో దిగడానికి ఆ పార్టీ సీనియర్ నేతలు నిరాకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇబ్బందులు కలిగిస్తోంది. యూపీఏ-2లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు సీనియర్లు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ, ఆర్థిక మంత్రి చిదంబరం, సచిన్ పైలట్, జయంతి నటరాజన్ తదితర సీనియర్ నేతలు ఎన్నికల బరిలో దిగడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు.. సీనియర్ నేతలంతా ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలుపు పట్టాలు ఎక్కించాల్సింది సీనియర్లేనని ఆయన చెబుతున్నారు.