రేపు క‌ృష్ణా బోర్డు నిర్ణయం

 

క‌‌ృష్ణా నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి సమావేశం ముగిసింది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీశైలం జల వివాదానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రాలేదని, ఈ విషయంలో తమ నిర్ణయాన్ని శుక్రవారం నాడు ప్రకటిస్తామని బోర్డు పేర్కొంది. సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని, రెండు రాష్ట్రాలూ ఈ విషయంలో తమ అభిప్రాయాలను తెలిపాయని, ఇరు రాష్ట్రాల నీటి, విద్యుత్ అవసరాలు, వినియోగంపై వాదనలు విన్నామని బోర్డు అధ్యక్షుడు పండిట్ పేర్కొన్నారు. బుధవారం నాడు జరిగిన మొదటి సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో గురువారం నాడు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాలూ ఒక నిర్ణయానికి వస్తాయని, అలా రాకుంటే మధ్యేమార్గంగా కృష్ణా బోర్డు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అందరూ భావించారు. అయితే బోర్డు మాత్రం తన నిర్ణయాన్ని శుక్రవారం నాడు ప్రకటిస్తానని తెలిపింది.