స్వామి ఆహ్వానం.. జూన్ 15న విజయవాడకు కేసీఆర్

 

హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలుసుకున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చిన కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్, వినోద్ కుమార్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల విగ్రహా ప్రతిష్టా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హజరుకాలేకపోయారు. దీంతో నేడు స్వామివారిని కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య జరిగిన ఏకాంత చర్చల్లో ఆథ్యాత్మిక, రాజకీయ అంశాలపై  చర్చించినట్లు సమాచారం. జూన్ 15న విజయవాడలో జరగనున్న పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ ను స్వరూపనందేంద్ర ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు నిర్వహిస్తారు.