ఎయిర్ పోర్ట్ లో జేసీ చిందులు..

 

టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు చేదు అనుభవం ఏర్పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ చిందులు తొక్కారు. ఎయిర్ ఇండియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గాను జేసీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అక్కడికి కొంచం లేటుగా రావడంతో అప్పటికే బోర్డింగ్ క్లోజ్ అయింది. ఈ విషయాన్ని సిబ్బంది చెప్పగా.. 'నా టికెట్టే రద్దు చేస్తారా?' అంటూ అధికారులపై మండిపడ్డారు. అంతేకాదు, తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా చిందులు తొక్కారు.