జగన్ దీక్షకు అనుమతి లేదు

 

 

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో తన నివాసం వద్ద నిరాహార దీక్షను ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతూ ఆయన దీక్షకు దీగారు. ఈ ఉదయం 11.30 గంటల నుండి ఆయన దీక్ష ప్రారంభమయింది. జగన్ దీక్ష నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు లోటస్ పాండ్ కు భారీగా తరలి వస్తున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో అటు వైపు ఎలాంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. లోటస్ పాండ్ పరిసర ప్రాంతాలలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే జగన్ దీక్షకు అనుమతి లేదని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.