జగన్ ఓదార్పు యాత్రా..ఎందుకు?

 

 

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి త్వరలో తెలంగాణలో మళ్ళీ ఓదార్పు యాత్రలు మొదలు పెట్టబోతున్నారనే వార్తలు రావడంతో, తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు జగన్ ఓదార్పు అనడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో నేతలు లేకుండా పోయినందుకు ఆయనకే ఓదార్పు అవసరమని అన్నారు. పలు సీనియర్ల రాజకీయ జీవితాలను దెబ్బ తీసిన జగన్ ఓదార్పులు చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్ ను తెలంగాణ ప్రజలు ఆదరించరని, గతంలో ఎదురైనా అనుభవాలు గుర్తుచేసుకోవాలని అన్నారు. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓదార్పు యాత్ర చేస్తారని ప్రశ్నించారు.